సహనం కోల్పోతే అది తెలంగాణ ప్రజల తప్పు కాదు: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేస్తే ప్రజలు సహనం కోల్పోతారని, అది వారి తప్పు కాదని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి బయలుదేరే ముందు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను అర్థం చేసుకోవడానికి 15 రోజులు చాలునని ఆయన అన్నారు. నివేదిక అందిన తర్వాత కేంద్రానికి సమయం ఇవ్వడం న్యాయమని ఆయన అన్నారు.

డిసెంబర్ తర్వాత రాష్ట్రానికి కేంద్ర బలగాలను రప్పిస్తామని డిజిపి అరవింద్ రావు చేసిన ప్రకటనను ఆయన తప్పు పట్టారు. అటువంటి ప్రకటనలు చేసి డిజిపి ఆభాసుపాలు కావద్దని ఆయన సూచించారు. బలగాలు ఉద్యమాలను ఆపలేవని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని మరోసారి శ్రీకృష్ణ కమిటీకి విన్నవిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ ఇస్తామని హోం మంత్రి పి. చిదంబరం రాజ్యసభలో, లోకసభలో ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని, లేకుంటే పార్లమెంటు గౌరవం తగ్గుతుందని ఆయన అన్నారు. కెసిఆర్ పది రోజుల పాటు ఢిల్లీలో ఉండి తెలంగాణకు అనుకూలంగా మద్దతు కూడగడుతారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+