వైయస్ జగన్ సాక్షిపై దాడులకు జర్నలిస్టుల నిరసన, ధర్నా

జర్నలిస్టులకు మాజీ ఎమ్మెల్సీ రెహ్నాన్ సంఘీభావం తెలిపారు. వైయస్ జగన్ వ్యక్తి కాదు, శక్తి అని ఆయన అన్నారు. వైయస్ జగన్ ను అణచివేయడానికి చేసే ప్రయత్నాలు సాగవని ఆయన అన్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు చాలా మంది వైయస్సార్ బొమ్మ పెట్టుకుని గెలిచారని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి దానం నాగేందర్ పై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. రాజీనామా చేసి దానం నాగేందర్ తనపై గెలవాలని ఆయన సవాల్ చేశారు. సాక్షి కార్యాలయాలపై దాడిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కూడా ఖండించారు.












Click it and Unblock the Notifications