తీవ్రంగా పరిగణించాల్సిన విషయం: వైయస్ జగన్ వ్యవహారంపై మొయిలీ

Veerappa Moily
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కె. రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పంపిన నివేదికలు అందాయని, ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను తాము ఢిల్లీకి అహ్వానించలేదని ఆయన చెప్పారు. రోశయ్యనే ఢిల్లీకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజా పరిస్థితులను రోశయ్య అధిష్టానానికి వివరిస్తారని ఆయన చెప్పారు.

కాగా, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై చర్చించేందుకు పార్టీ అధిష్టానం కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఢిల్లీకి అహ్వానించింది. ఇందులో భాగంగానే రోశయ్య ఢిల్లీకి వస్తున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే, మరో ప్రచారం కూడా జరుగుతోంది. వైయస్ జగన్ వ్యవహారం నుంచి మొయిలీని పక్కకు తప్పించారని, అందువల్ల నేరుగా సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రోశయ్యతో మాట్లాడి ఢిల్లీకి పిలిచినట్లు చెబుతున్నారు. రోశయ్య ఢిల్లీకి ఎందుకు, ఎలా వెళ్తున్నా వైయస్ జగన్ వ్యవహారంపై, మంత్రివర్గ విస్తరణపై కచ్చితంగా అధిష్టానంతో చర్చించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, మంగళవారం సాయంత్రం సోనియా రోశయ్యకు అపాయింట్ మెంటు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+