ప్రభుత్వంలో చేరుతామన్న వార్తలు ఊహాజనితాలే: చిరంజీవి

ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడినా రోశయ్య తన అనుభవంతో నెట్టుకు రాగలరని ఆయన అన్నారు. రోశయ్య ప్రభుత్వానికి ప్రస్తుతం ఏ విధమైన ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజారాజ్యం పార్టీ విలీనం కాదని ఆయన స్పష్టం చేశారు. రోశయ్య ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ఆయన చెప్పారు. ఢిల్లీకి చేరుకున్న చిరంజీవి నేరుగా హోటల్ కు వెళ్లిపోయారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధానిని కలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇవ్వాల్సిన అవసరం రాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications