అభిమానులకు దూరమవుతున్న ఎంపీ జగన్: రాజయ్య

MP Rajaiah
వరంగల్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్రమంగా దూరమవుతున్నాడని కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజయ్య మంగళవారం అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో సమైక్యాంధ్ర ఫ్లకార్డు పట్టుకొని ఇప్పటికే జగన్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కార్యకర్తలకు దూరమయ్యాడన్నారు. ఇప్పుడు తన కార్యకలాపాల ద్వారా సీమాంధ్రులకు సైతం దూరమవుతున్నాడన్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని జగన్ తన పత్రిక సాక్షిలో విమర్శించడం కుట్రతోనే జరిగిందన్నారు. సోనియా గాంధీపై ప్రజలకు దురుద్దేశ్యాలను అంటగట్టాలనే ఇలాంటి కథనాన్ని ప్రసారం చేశారని ఇది చాలా గర్హనీయమైనదని చెప్పారు. క్రమంగా అభిమానులకు జగన్ దూరమవుతున్నాడని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+