సివిసి నియామకంపై ప్రధానికి సుప్రీంకోర్టు అక్షింతలు

థామస్ ఇటీవల వరకు కేంద్ర టెలికం కార్యదర్శిగా పనిచేశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు 7న కేంద్రం సీవీసీగా నియమించింది. ప్రధాని మన్మోహన్సింగ్, హోంమంత్రి చిదంబరం, లోక్సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్లతో కూడిన త్రిసభ్య కమిటీ సీవీసీని ఎంపిక చేయాల్సి ఉండగా సుష్మాస్వరాజ్ థామస్ నియామకాన్ని వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. థామస్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ లింగ్డో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. థామస్ కేరళ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు పామోలిన్ దిగుమతి కుంభకోణంలో ఆయనపై అభియోగపత్రం దాఖలయిందని, ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉండగా సీవీసీగా నియామకం తగదని పిటిషన్లలో పేర్కొన్నారు.
కేంద్ర టెలికం కార్యదర్శిగా కూడా ఇటీవల వరకు ఆయన పనిచేశారని, 2జీ కుంభకోణం నేపథ్యంలో సీవీసీగా నియమిస్తే ద్వి ప్రయోజనాల వైరుధ్యం (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్స్) అవుతుందని వాదించారు. విపక్ష నేత ఈ నియమకాన్ని వ్యతిరేకించినా కేంద్రం బేఖాతరు చేసిందని తప్పుపట్టారు. ఈ పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు థామస్ నియామకంలో అనుసరించిన ప్రమాణాలను క్షుణ్నంగా పరిశీలించాలని గతంలో నిర్ణయించింది. నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలతో దస్త్రాన్ని దాఖలు చేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications