ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టీమ్ లో ఉండేది వీరేనా?

శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజులకు, మహిళాకోటాలో బొడ్డేపల్లి సత్యవతికి కూడా అవకాశం లభించవచ్చునని చెబుతున్నారు.
విజయనగరం: బొత్స సత్తిబాబు. మంత్రి పదవి లేకుండా ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే తన కుటుంబానికి చెందిన వారికి మంత్రిపదవికోసం పట్టుబట్టే అవకాశం ఉంది.
విశాఖపట్నం: బాలరాజు
తూర్పుగోదావరి: విశ్వరూప్ లేదా మహిళా కోటాలో రాజేశ్వరీదేవి. రంపచోడవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదివాసి తెగకు చెందిన విద్యాధికుడైన ఎస్.వి.వి.సత్యనారాయణకు మంత్రిపదవి కోసం కిశోర్చంద్రదేవ్ పట్టుబడుతున్నారు. తోట నరసింహం పేరు కూడా వినిపిస్తోంది.
పశ్చిమగోదావరి: వట్టి వసంత కుమార్, పితాని సత్యనారాయణ.
కృష్ణా: కొలుసు పార్థసారధి.
గుంటూరు: కన్నా లక్ష్మినారాయణ, మోపిదేవి వెంకటరమణ. గాదె వెంకటరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ల భవితవ్యం ఇతర జిల్లాల్లో సామాజిక సమీకరణలపై ఆధారపడి ఉంది. గాదె వియ్యంకుడు డీఎల్ రవీంద్రారెడ్డికి మంత్రిపదవి ఇస్తే గాదెకు అవకాశంలేనట్లే.
ప్రకాశం: ఎం.మహీధర్ రెడ్డి లేదా గొట్టిపాటి రవికుమార్. గుంటూరు జిల్లా సామాజిక సమీకరణలను బట్టి వీరిలో ఆ ఒక్కరెవరనేది తేలుతుంది.
నెల్లూరు: ఆనంరామనారాయణరెడ్డి.
చిత్తూరు: గల్లా అరుణ. అనూహ్యంగా ఈ జిల్లాను ఖాళీగానూ ఉంచవచ్చు.
కడప: వై.ఎస్.వివేకానందరెడ్డి, డీ.ఎల్.రవీంద్రారెడ్డిఅహ్మదుల్లా. ఇక్కడి నుంచి ఇద్దరికే అవకాశం ఇవ్వాలనుకుంటే కొంత ఇబ్బంది తప్పదు.
అనంతపురం: రఘువీరారెడ్డి. జేసీదివాకరరెడ్డి విషయం అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఎస్సీల్లో మాదిగ కోటాను బట్టి శైలజానాధ్కు అవకాశం ఉంటుంది.
కర్నూలు: టీజీవెంకటేష్, ఏరాసుప్రతాప్రెడ్డి
మహబూబ్నగర్: జూపల్లి కృష్ణారావు. సామాజిక సమీకరణలను బట్టి డీకే అరుణ భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే మహిళా కోటాయే ఆమెకు రక్ష.
రంగారెడ్డి: సబితా ఇంద్రారెడ్డి.
హైదరాబాద్: దానం నాగేందర్, ముఖేష్ గౌడ్. మర్రి శశిధర్ రెడ్డి, శంకర్రావుల విషయంలో అధిష్ఠానం నిర్ణయం కీలమయింది.
నల్గొండ: జానారెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీఉన్నా ఉత్తమ్కు చీఫ్విప్ ఇచ్చి కోమటిరెడ్డికి మళ్ళీ అవకాశం ఇవ్వొచ్చు.
ఖమ్మం: రాంరెడ్డి వెంకట్రెడ్డి. ఇతర జిల్లాల సమీకరణలు, ఎస్సీకోటా పెరగడం వంటి కారణాలతో మల్లు భట్టి విక్రమార్కకు కూడా అవకాశం దక్కవచ్చు.
మెదక్: దామోదర్ రాజనరసింహకు ఉపముఖ్యమంత్రి పదవి ఖాయమే. స్పీకర్ కాకుంటే గీతారెడ్డి కొనసాగుతారు. మహిళా కోటా కింద సునీతా లక్ష్మారెడ్డి నిలబడతారా పదవి కోల్పోతారా అనేది తేలడం లేదు.
కరీంనగర్: దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
వరంగల్: బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య లేదా గండ్ర వెంకటరమణారెడ్డి.
నిజామాబాద్: సురేష్రెడ్డి కాకుంటే సుదర్శనరెడ్డి












Click it and Unblock the Notifications