వైయస్ జగన్, వైయస్ వివేకానందల మధ్య తుది చర్చలూ విఫలం

YS Vivekananda Reddy
కడప‌: కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన వైయస్ జగన్ కు, ఆయన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డికి మధ్య మంగళవారం రాత్రి తుదిగా చర్చలు జరిగాయి. ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి. కుటుంబ సభ్యుల జోక్యంతో వారిద్దరి మధ్య కడపలోని వారి సమీప బంధువు సివీ సుబ్బారెడ్డి నివాసంలో చర్చలు జరిగాయి. ఉదయం పూట వైయస్ జగన్ వ్యవహారశైలిలో విసురుగా బయటకు వచ్చిన వైయస్ వివేకానంద రెడ్డి కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను కాంగ్రెసుతోనే ఉంటానని ప్రకటించారు. వైయస్ జగన్ పార్టీ అధిష్టానంపై చేసిన విమర్శలను ఖండించారు.

చివరగా, కుటుంబ సభ్యుల జోక్యంతో వైయస్ జగన్ వైయస్ వివేకానంద రెడ్డితో రాజీకి ప్రయత్నించారు. చీలిపోతే కుటుంబం పరువు పోతుందని చెప్పడంతో వైయస్ జగన్ బాబాయ్ తో చర్చలు జరపడానికి మంగళవారం రాత్రి పులివెందుల నుంచి కడపకు బయలుదేరి వచ్చారు. అయితే, ఇరువురి మధ్య చర్చలు ఫలించలేదు. వైయస్ వివేకానంద రెడ్డి హైదరాబాదుకు బయలు దేరి వెళ్లారు. ఆ తర్వాత వైయస్ జగన్ చాలా సేపు సుబ్బారెడ్డి నివాసంలోనే ఉన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ చర్చలు జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+