ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కె. చంద్రశేఖర రావు వార్నింగ్

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామని తెరాస అధ్యక్షుడు కేసీఆర్పార్టీ శ్రేణులతో చెప్పారు. వివిధ సంస్థలు చేసిన సర్వే నివేదికల ప్రకారం ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తే తెరాసకు కనీసం 70-80 స్థానాలు వస్తాయని వివరించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో తెరాస కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. వచ్చే 7 నెలల్లో రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇది తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటే తమ పార్టీ లక్ష్యమని, గమ్యమని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమైన రాజకీయ వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించారు. తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందని కొన్ని మీడియా సంస్థలుప్రచారం చేస్తున్నాయని, ఇది మంచిదికాదన్నారు. ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని, వివరణ తీసుకోవాలని సూచించారు.
ఢిల్లీ పెద్దలకు తెలంగాణ సత్తా తెలిపే విధంగా ఈ నెల 9న వరంగల్లో మహాగర్జన సభ నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. ఎన్సీపీ నేత పీఏ సంగ్మా, స్వామి అగ్నివేశ్ అతిథులుగా హాజరవుతారని చెప్పారు. సభ నిర్వహణ కోసం పార్టీ చేపట్టిన కూలీపనికి మంచి స్పందన వచ్చిందని రూ.2.5 కోట్ల కూలీ లభించిందన్నారు. నిధుల సమీకరణకు సహకరించినవారికి కృతజ్ఞతలు చెప్పారు. అమెరికా నుంచి 5,000 డాలర్లు విరాళం వచ్చిందని తెలిపారు. లండన్లో త్వరలో కూలీపని చేపట్టనున్నామని చెప్పారు. సభకు 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని వివరించారు. ఈ నెల 6 నుంచి నిర్వహించ తలపెట్టిన లారీ, డీసీఎంల సమ్మెను వాయిదా వేసుకోవాల్సిందిగా యజమానులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 9న మహాగర్జన సభ ఉన్నందున సమ్మెను 10వ తేదీకి వాయిదా వేసుకోవాలని కోరారు. మహాగర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.












Click it and Unblock the Notifications