ఉద్యోగులు సహకరించుకుంటే నా వికెట్ పడిపోతుంది: కిరణ్ కుమార్

Kiran kumar Reddy
హైదరాబాద్: వ్యవస్థలో లోపాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సచివాలయ ఉద్యోగుల సమావేశంలో అన్నారు. ప్రజల పట్ల మీరు సెన్సిటివ్ గా ఉంటే నేను మీ పట్ల సెన్నిటివ్ గా ఉంటానని ఆయన వారికి తెలిపారు. ఉద్యోగులు తప్పు చేస్తే నా వికెట్లు పడిపోతాయన్నారు. ప్రభుత్వానికి మూడున్నరేళ్ల సమయం మిగిలి ఉందని, అయితే తనకు పదేళ్ల పని చేయాలని ఉందన్నారు. దానికి ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు. మీ సహకారం అందిస్తే నేను అనుకున్న పదేళ్ల పని చేస్తానన్నారు.
కొన్ని తప్పులు అనుకోకుండా కూడా జరుగుతాయని, అయితే అవి గ్రహించేలోగా నష్టం వాటిల్లుతున్నదన్నారు. అలా జరగకుండా చూడాలన్నారు. కొందరు తప్పించుకుంటున్నారన్నారు. సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ వంటిదన్నారు. గుండె ఆరోగ్యంగా లేకుంటే ఎలా అయితే మనిషికి సమస్యనో సచివాలయం బాగా లేకుంటే ప్రజలకు కూడా అంతే సమస్య అన్నారు. శాలువాలకు, బోకేలకు పెట్టే ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తే సంతోషిస్తానన్నారు. మనమంతా ఒక జట్టుగా కలిసి ఉండాలన్నారు.
సచివాలయంలో జరిగే ప్రతి పనిలో కూడా పారదర్శకత ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పనితీరుపై త్వరలో ఓ కమిటి వేస్తామని చెప్పారు. పాలనా వ్యవస్థను సంస్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలన్నారు. పథకాలు అర్హులకు చేరితేనే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ఆయన వారితో అన్నారు. ప్రభుత్వానికి రాబడి కూడా ముఖ్యమేనన్నారు. రాబటి ఉంటేనే సంక్షేమం ఉంటుందని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+