ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెడ్లకే పెద్ద పీట

పది మంది బిసీలకు మంత్రి పదవులు దక్కాయి. ఎస్సీలకు ఆరు మంత్రి పదవులు దక్కాయి. వీరిలో మాలలకు మూడు, మాదిగలకు మూడు మంత్రి పదవులు లభించాయి. మాదిగ, మాల ఉప కులాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఏర్పడింది. ఎస్టీలకు, మైనార్టీలకు ఒక్కటేసి మంత్రి పదవులు దక్కాయి. కొప్పుల వెలమకు ఒక్క మంత్రి పదవి దక్కింది. రజకుల నుంచి ఒక్కరిని మంత్రిగా తీసుకున్నారు. మున్నూరు కాపులకు రెండు, తూర్పు కాపులకు ఒక్కటి, శెట్టి బలిజలకు ఒక్క మంత్రి పదవులకు దక్కాయి. యాదవులకు రెండు మంత్రి పదవులు లభించాయి. మత్స్యకారుల నుంచి ఒక్కరికి మంత్రి పదవి లభించింది.












Click it and Unblock the Notifications