వైయస్సార్ కుటుంబంలో కాంగ్రెసు అధిష్టానం చిచ్చు పెట్టింది: రోజా

Roja
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీనుండి దివంగత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్లలేదని ఆయన బయటకు వెళ్లగొట్టబడ్డారని సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీది మొదటినుండి విభజించి పాలించే రాజకీయం అన్నారు. తన తోటి కోడలు మేనకాగాంధీ రాజకీయంగా తనకు అడ్డువస్తారని ఆమెను, ఆమె కొడుకును బయటకు వెళ్లగొట్టారన్నారు. రాష్టంలో సైతం తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబునాయుడిని దెబ్బతీయడానికి ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడిని కాంగ్రెసు లోకి ఆహ్వానించి తర్వాత ఆయనకు మొండి చేయి చూపారన్నారు.

ఇప్పుడు వైయస్ వివేకానందకు మంత్రి పదవి ఆశచూపి జగన్ ను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్లిపోవటం రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోకూడా కాంగ్రెసు పార్టీకి పెద్ద దెబ్బ అన్నారు. కాంగ్రెసు పార్టీని కుటుంబంలా చూసుకునే వారిని పార్టీ బయటకు తోసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి 20 ఏళ్ల వరకు తిరుగు లేదని అనుకున్నారని అయితే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా 20 రోజులు కూడా కష్టమేనన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆయన వెంటే తిరిగిన వారు పదవుల కోసం ఆశపడుతున్నారన్నారు. వైయస్ పెట్టిన బిక్ష వల్లనే కొందరు మంత్రులుగా ఎదిగారన్నారు. వారికి సొంతగా నిలబడితే పది ఓట్లు కూడా పడయన్నారు. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి సినిమాల్లో నటించడం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+