వైయస్ జగన్ సాక్షి మీడియా టార్గెట్ కాంగ్రెసు అధిష్టానం

Sakshi
హైదరాబాద్‌: కాంగ్రెసు అధిష్టానాన్ని వైయస్ జగన్ కు చెందిన సాక్షి మీడియా టార్గెట్ చేసుకుంది. వైయస్ జగన్, వైయస్ విజయలక్ష్మి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి సాక్షి మీడియా పార్టీ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. కుటుంబంలో చిచ్చు పెట్టిందని సాక్షి దిన పత్రిక బుధవారం పతాక శీర్షికన వార్తాకథనాన్ని ప్రచురించింది. కాంగ్రెసు అధిష్టానమే కుట్ర చేసి వైయస్ జగన్ ను బయటకు పంపిందని జాతీయ మీడియా కోడై కూస్తున్నట్లు సాక్షి చానెల్ హోరెత్తుతోంది. వైయస్ జగన్ కాంగ్రెసు అధ్యక్షురాలు ోసనియా గాంధీకి రాసిన ఐదు పేజీల లేఖను సాక్షి చానెల్ సిఇవో ఎన్ రామ్ పదే పదే చదివి వినిపిస్తున్నారు. సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురించిన వార్తాకథనంలో 'అమ్మ' పలుకు అంటూ పరోక్షంగా సోనియా గాంధీపై నిప్పులు చెరిగింది. వైయస్ వివేకానంద రెడ్డిని చేరదీసి వైయస్సార్ కుటుంబాన్ని చీల్చిన కుట్ర సోనియానే చేశారనే అర్థం వచ్చేలా ఆ శీర్షిక పెట్టారు. వైయస్సార్ కుటుంబంలో చిచ్చు నాటకానికి స్క్రీన్ ప్లే అధిష్టానానిదేనని వ్యాఖ్యానించింది.

వైయస్ వివేకానంద రెడ్డిని చేరదీసి పార్టీ అధిష్టానం వైయస్ జగన్ కుట్ర చేసిందని వ్యాఖ్యానించింది. వైయస్ వివేకానంద రెడ్డి చేత అధిష్టానమే నాటకం ఆడించిందని ఆరోపించింది. వివేకానంద రెడ్డిని చేరదీసి ముమ్మాటికీ కుటుంబంలో కలతలు రేపే కుట్ర చేసిందని, ప్రెస్ ‌మీట్ ‌లో వివేకా మాటతీరే తిరుగులేని నిదర్శనమని చెప్పింది. జగన్ లేఖకు సమాధానం చెప్పేందుకే వైయస్ వివేకా ప్రాధాన్యం ఇచ్చారని, అడుగడుగునా అధినేత్రిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారని, విజయమ్మకు నెలకు గానీ దొరకని సోనియా అపాయింట్‌మెంట్ వివేకాకు మాత్రం రెండు రోజుల్లోనే పిలుపు వచ్చిందని, అరగంటపైగా చర్చలు జరిపారని అంటూ దీని పరమార్థం కుట్ర గాక మరేమిటని సాక్షి ప్రశ్నించింది. వైయస్ వివేకానంద రెడ్డి అధిష్టానం చేతిలో పావుగా మారారని చెప్పడానికి సాక్షి భారీ వార్తాకథనాన్ని ప్రచురించింది.

కాగా, బుధవారం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా సాక్షి టీవీ చానెల్ గమ్మత్తుగా ప్రసారం చేసింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ మరో వైపు ఇడుపులపాయలో వైయస్ జగన్, వైయస్ విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలను మరో పక్క చూపుతూ వచ్చింది. వైయస్సార్ కు ద్రోహం చేస్తూ మంత్రి పదవులు చేపడతున్నారని అర్థం వచ్చేలా ఈ ప్రసారం సాగింది. మంత్రివర్గ ఏర్పాటుపై అన్ని మీడియా చానెళ్లలోనూ వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు దుమ్మెత్తిపోస్తూ వచ్చారు. కొండా సురేఖ, పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు వంటి నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ కూర్పుపై నిప్పులు కక్కుతూ వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+