జగన్ ను దెబ్బ తీసేందుకు కాంగ్రెసు హైకమాండ్ మరో వ్యూహం?

కాగా, కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి వచ్చే ఏడాది జనవరిలోనే ఎన్నికలు నిర్వహించడం ద్వారా వైయస్ జగన్ ను దెబ్బ తీయాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తోంది. ఉప ఎన్నికల్లో జగన్ కొత్త పార్టీ తరఫున పోటీ చేస్తారని అంబటి రాంబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈలోగా వైయస్ జగన్ పార్టీ పెట్టినా కడప పార్లమెంటు సీటులో, పులివెందులలో ఆయనను దెబ్బ కొట్టేందుకు ఇప్పటికే వ్యూహరచన ఖరారైనట్లు తెలుస్తోంది. జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో తనకు మద్దకు కూడగట్టుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పులివెందుల నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు.
వైయస్ జగన్ రాజీనామాను లోకసభ స్పీకర్ మీరా కుమార్ ఇప్పటికే ఆమోదించారు. పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి వైయస్ విజయమ్మ చేసిన రాజీనామాను కూడా రేపో మాపో ఆమోదించే అవకాశాలున్నాయి. కడప పార్లమెంటు సీటులో ఉన్న ఇద్దరు శాసనసభ్యులకు, వైయస్ వివేకానంద రెడ్డికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు ఈ పార్లమెంటు పరిధిలోకే వచ్చే శాసనసభ్యుడు వీరశివారెడ్డి కూడా వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. కడప పార్లమెంటు సీటులో వైయస్ జగన్ పై ముప్పేట దాడికి కాంగ్రెసు హై కమాండ్ రంగం సిద్ధం చేసింది.












Click it and Unblock the Notifications