వైయస్ జగన్ దీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు: మాజీ సిఎం రోశయ్య

Rosaiah
హైదరాబాద్‌: వైయస్ జగన్ చేపట్టిన లక్ష్యదీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి జగన్ దీక్ష చేపట్టి ఉండవచ్చునని ఆయన మంగళవారం సిఎల్పీ సమావేశంలో అన్నారు. తన పర్యటనల సందర్భంగా వైయస్ జగన్ ఆచితూచి రైతుల కష్టాలను తెలుసుకున్నారని, దాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికే జగన్ దీక్ష చేపట్టి ఉంటారని ఆయన అన్నారు. వైయస్ దీక్షలో పాల్గొన్నవారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడు ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరిస్తే బాగుండేదని ఆయన అన్నారు. రైతు సమస్యలపై చంద్రబాబు నేరుగా ముఖ్యమంత్రిని కలిసి సూచనలు చేయవచ్చని చెప్పారు. ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకే జగన్‌ దీక్ష చేపట్టి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+