విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ తో కాంగ్రెసుకు ఎదురుదెబ్బ: వెంకయ్య నాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వల్ల కాంగ్రెసుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పునాదులు కదులుతున్నాయని, ఇప్పటికే కదిలాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పునాదులు కదులుతున్నా కాంగ్రెసు నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ లక్ష్యదీక్షకు వచ్చినవారు 96 శాతం మంది కాంగ్రెసు కార్యకర్తలేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ తో జత కట్టే ప్రతిపాదన తమ పార్టీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన 15 ప్రశ్నలు సంధించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మంచిదైతే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఎందుకు కలిశారని ఆయన అడిగారు. రైతు సమస్యలపై ఈ నెల 28వ తేదీన సచివాలయం ముట్టడి చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X