మద్దెలచెర్వు సూరి వాడిన కారు ఎన్నారై గారపాటి రత్నకుమార్ ది
సూరి హత్యకేసు సెంట్రల్ క్రైం స్టేషన్కు (సీసీఎస్)కు బదిలీ చేసినట్లు హైదరాబాద్ కమిషనర్ ఎ.కె.ఖాన్ వెల్లడించారు. అదనపు పోలీస్ కమిషనర్(నేరాలు) ఉమాపతి ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. సూరిని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు ఆరు బృందాల్ని నియమించినట్లు ఖాన్ తెలిపారు. సూరితో పాటు కారులో ఉన్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని ఆయన వెల్లడించారు. కారు డ్రైవర్ ద్వారా కొంత విలువైన సమాచారం లభించినా అతను షాక్లో ఉన్నందున పూర్తి వివరాలు లభ్యం కాలేదన్నారు. డ్రైవర్ చెప్పిన ప్రకారం..సంఘటన సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Comments
Story first published: Tuesday, January 4, 2011, 8:49 [IST]