కోదండరామ్, దత్తాత్రేయ అరెస్టు, రాస్తోరోకోలో తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాదుకు సమీపంలోని రాజేంద్ర నగర్ వద్ద కూడా రాస్తారోకో జరిగింది. హైదరాబాదుకు వచ్చే జాతీయ రహదారులపై తెలంగాణవాదులు రాస్తారోకోలకు దిగారు. దీంతో హైదరాబాదుకు రావాల్సిన వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ తీరును జెఎసి నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు.
Comments
Story first published: Monday, January 17, 2011, 12:22 [IST]