గవర్నర్‌ను రికాల్ చేయండి: రాష్ట్రపతికి బిజెపి నేతల వినతి

BJP
న్యూఢిల్లీ: తనకు సంక్రమించి రాజ్యాంగాధికారాలను పక్షపాత ధోరణితో వాడుతున్న కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్‌ను రీకాల్ చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతలు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కోరారు. ఎల్‌కె అద్వానీ నేతృత్వంలోని బిజెపి నాయకులు సోమవారం రాష్ట్రపతిని కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిని కలిసినవారిలో అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ కూడా ఉన్నారు. కర్ణాటక గవర్నర్‌గా భరద్వాజ్‌ను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించినట్లు భేటీ అనంతరం అద్వానీ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

భూకుంభకోణాలకు సంబంధించిన తాజాగా సోమవారం యడ్యూరప్పపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఇవే ఆరోపణలపై యడ్యూరప్ప మీద గత వారం రెండు కేసులు నమోదయ్యాయి. తాను కూడా భరద్వాజ్‌పై కేసు నమోదు చేస్తానని యడ్యూరప్ప సోమవారం చెప్పారు. అయితే, అది ఏ విధమైన కేసు అనేది ఆయన చెప్పలేదు. కర్ణాటకలో పరిస్థితిని వివరించడానికి యడ్యూరప్ప ఆదివారం బిజెపి అగ్రనేతలను ఢిల్లీలో కలిశారు. తన కుమారుడికి అనుకూలంగా ముఖ్యమంత్రి భూములను డీనోటిఫై చేయడం అనైతికమని, సరైంది కాదని చైనా పర్యటనలో ఉన్న బిజెపి అధ్యక్షుడు గడ్కరీ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన పార్టీ అగ్రనేతలను కలిశారు.

గడ్కరీ వ్యాఖ్యలపై మాట్లాడడానికి యడ్యూరప్ప నిరాకరించారు. తమ పార్టీ జాతీయాధ్యక్షుడి వ్యాఖ్యలపై తాను ఏమీ మాట్లాడ దలుచుకోలేదని, తాను గడ్కరీతోనే మాట్లాడుతానని ఆనయ చెప్పారు. భూ కేటాయింపుల్లో తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+