తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి గల్లా అరుణకుమారిని అడ్డుకున్న వైయస్ జగన్ వర్గీయులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Galla Aruna Kumari
తిరుపతి: మంత్రి గల్లా అరుణకుమారిని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గీయులు తిరుపతిలో అడ్డుకున్నారు. చిత్తూలు జిల్లాలోని రామచంద్రాపురం మండలం పివిపురం గ్రామంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో మంత్రి గల్లా అరుణకుమారి పాల్గొనేందుకు వెళ్లారు. అయితే అక్కడకు చేరుకున్న గల్లా అరుణను వైయస్ జగన్ వర్గీయులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌కు, మంత్రికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

కాగా విజయవాడలో కూడా జగన్ అభిమానులు రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మధురానగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే జగన్ వర్గీయులు అయనను అడ్డుకున్నారు. వారితో పాటు సిపిఐ కార్యకర్తలు కూడా విష్ణును అడ్డుకుని రేషన్‌కార్డులు తదితర అంశాలపై ప్రశ్నించారు. చివరకు సిపిఐ వారు ధర్నాకు దిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X