వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్సార్‌పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసల జల్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
విజయనగరం: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. విజయనగరం జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన సోమవారం వైయస్సార్‌ను కొనియాడారు. వైయస్సార్‌పై ప్రజలకు ఎంత ప్రేమ ఉందో, కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు అంతే ప్రేమ ఉందని ఆయన చెప్పారు. వైయస్సార్ మరణంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. వైయస్సార్ మరణం ఎంతో బాధపెట్టిందని, ఆ బాధను దిగమింగి వైయస్సార్ కార్యక్రమాలను ముందుకు తీసుకుని పోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

అంతకు ముందు ఆయన శ్రీకాకుళం జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ప్రజల నుంచి వివిధ పథకాల లబ్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆయన విజయనగరం జిల్లాకు వచ్చారు. విజయనగరం జిల్లా నుంచి ఆయన హెలికాప్టర్‌లో విశాఖపట్నం చేరుకున్నారు. అర్హులైనవారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X