అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యేక తెలంగాణ రచ్చబండలో తేలేది కాదు: మాజీ సిఎం రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
గుంటూరు/అనంతపురం: ప్రత్యేక తెలంగాణ అంశం వీధుల్లోనే, రచ్చబండలోనో తేలే అంశం కాదని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సోమవారం గుంటూరులో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రచ్చబండను ఎవరూ అడ్డుకోవద్దని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి అందరూ ఆలోచించి దానిని అడ్డుకునే యత్నాలు మానుకోవాలని సూచించారు. రచ్చబండను అడ్డుకుంటామని తెలంగాణ, తెలుగుదేశం పార్టీలు అనడాన్ని ఆయన తప్పుపట్టారు. అది సరికాదన్నారు. రచ్చబండ విజయవంతం కావడానికి ప్రతిపక్షాలు కూడా సహకరించాలని కోరారు.

కాగా మంత్రి రఘువీరా రెడ్డి కూడా రచ్చబండను అడ్డుకోవడాన్ని అనంతపురంలో ఖండించారు. రచ్చబండ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమని దానిని అడ్డుకోవడం సరికాదన్నారు. అందరూ రచ్చబండకు సహకరించాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X