తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రస్తుతానికి కాంగ్రెసు ప్రభుత్వంలో చేరం: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: ప్రస్తుతానికి తాము కాంగ్రెసు ప్రభుత్వంలో చేరబోమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన మంగళవారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మంచిని మంచిగా, చెడును చెడుగా చెప్పడమే తమ పని ఆయన అన్నారు. ప్రభుత్వంలో చేరుతారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగితే ఆయన విసుక్కున్నారు. చేరబోమని చెప్పాం కదా, మళ్లీ అదే ప్రశ్న వేస్తారెందుకని ఆయన విసుగు ప్రదర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు.

పేదలకు మేలు చేయడానికే రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారని, దాన్ని అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తాము కాంగ్రెసుకు సన్నిహితమవుతున్నామనే మాటల్లో కూడా నిజం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు తనపై దురుసుగా మాట్లాడడంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. ఎవరేమన్నా తన పంథాలో తాను పోతానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X