పాలనాభవనంపై విద్యార్థులు నిరసన, ఉస్మానియాలో మరోసారి ఉద్రిక్తత

Osmania University
హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు విశ్వవిద్యాలయం పాలనా భవనంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు భవనంపైకి ఎక్కిన విద్యార్థులు మంగళవారం ఉదయం వరకు కూడా దిగి రాలేదు. భవనంపై 8 మంది విద్యార్థులున్నారు. తీవ్రమైన చలిలోనూ విద్యార్థులు భవనంపైనే ఉన్నారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని, అప్పటి వరకు తాము పరీక్షలు రాయబోమని విద్యార్థులంటున్నారు. నిన్నటి నుంచి తమ వద్దకు అధికారులు ఎవరూ రాలేదని విద్యార్థులు చెప్పారు. ఇతర కళాశాలల విద్యార్థులు పరీక్షలు బహిష్కరించి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+