హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్‌ది ముఖ్యపాత్ర: పిసిసి అధ్యక్షుడు డిఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ బుధవారం అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కులమతాలకు అతీతంగా ముందుకు తీసుకు వెళుతుందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎదుగుదల చూడలేకే ఆమెను టార్గెట్ చేస్తున్నారని డిఎస్ అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అభివృద్ధిలో భాగంగానే రచ్చబండ కార్యక్రమం ప్రభుత్వా ప్రారంభించిందన్నారు. రచ్చబండ కార్యక్రమం వల్ల 28 లక్షల మంది లబ్ధి పొందనున్నారని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X