వైఎస్‌పై కామెంట్స్‌పై రిపీట్ చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి

YS Rajasekhar Reddy
అనంతపురం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై తాను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను ఆదివారం రిపీట్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ ఆదివారం అనంతపురం జిల్లా రచ్చబండలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంత స్థాయికి ఎదిగారన్నారు. కాంగ్రెస్ అండతో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి లక్షలాది, కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. వైఎస్ అంతపెద్ద నాయకుడయ్యాడంటే కారణం కాంగ్రెస్ అని చెప్పారు. వైఎస్ అసంపూర్తి చేసిన ప్రజా సంక్షేమ పథకాలను పూర్తి చేయడానికే అధిష్టానం నన్ను ముఖ్యమంత్రిగా నియమించిందని చెప్పారు.

ముఖ్యమంత్రి ఇటీవలే రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అండతో వైఎస్ ఎదిగారని చెప్పారు. ముఖ్యమంత్రి పలుమార్లు ఈ వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ వల్లే వైఎస్ ఆ స్థాయికి ఎదిగారనే నిజాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లారని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ అండ ఏం చేయలేరనే విషయాన్ని ప్రజలకు స్ఫష్టం చేయదలుచుకున్నారు. వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు సొంత పథకాలు కాదని, అవి కాంగ్రెస్ పథకాలని ప్రజలకు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ వర్గం సంక్షేమ పథకాలను వైఎస్ పథకాలుగా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలను ముఖ్యమంత్రి పక్కా వ్యూహంతో తిప్పికొడుతున్నట్టుగా తెలుస్తోంది.

పథకాలను వైఎస్ ప్రవేశ పెట్టినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం ఉందని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ వర్గం ఆ పథకాలను వైఎస్ పథకాలుగా ప్రజలను మభ్యపెడితే పార్టీకి కొంత నష్టం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి పలుమార్లు అవి పార్టీ పథకాలుగా చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా భావించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+