చరిత్ర చూడండి: కెసిఆర్పై మంత్రులు దానం నాగేందర్, గీతారెడ్డి ఫైర్

ఇంతవరకు నిధులు ప్రకటించి జనంలోకి వెళ్లిన ఘనత కేవలం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఒక్కరికే దక్కిందన్నారు. రచ్చబండను పేదలెవరూ అడ్డుకోలేదన్నారు. కేవలం పది, ఇరవై మంది వచ్చి అడ్డుకున్నంత మాత్రాన ప్రభుత్వం ప్రజలకు చేయాలనుకున్న మంచిని చేయకుండా ఊరుకోదన్నారు. కొన్నిచోట్ల రచ్చబండను అడ్డుకుంటే పేదలే వారిని తరిమికొట్టారన్నారు.
కోడిగుడ్లు విసిరి రచ్చబండను అడ్డుకున్నంత మాత్రాన ప్రజలకు చేయాల్సిన అభివృద్ధిని ప్రభుత్వం ఆపేది లేదని మరో మంత్రి గీతారెడ్డి అన్నారు. కోడిగుడ్లు విసరడం, అభివృద్ధి పనులు ఆపడం సరికాదన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు తలదించుకునేలా ఉన్నాయన్నారు. కెసిఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications