హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం, ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు: ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులమంతా కట్టుబడి ఉన్నామని ఆదివారం ఎంపీలు స్పష్టం చేశారు. ఉదయం తెలంగాణ ఎంపీలు ఎంపీ వివేక్ ఇంట్లో భేటీ అయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలం రాజీలేని పోరాటం చేస్తున్నామని ఎంపీ మధుయాష్కీ అన్నారు.తెలంగాణను తెచ్చి చరిత్ర సృష్టిస్తామని చెప్పారు. తెలంగాణపై మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. మాకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీపైన నమ్మకం ఉందన్నారు. తెలంగాణకు వెనుకడుగు వేసేది లేదన్నారు. తెలంగాణేతరుల రక్షణకు మాదే బాధ్యత అని ప్రకటించారు.

తెలంగాణపై ఇక తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయమేనని ఎంపీ రాజయ్య స్పష్టం చేశారు. మాకు తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయ మార్గలేవీ వద్దని మంద జగన్నాథం అన్నారు. అధినేత్రిని కించపరిస్తే మాట్లాడని వారే తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తున్నామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.తెలంగాణ తప్ప మాకేది వద్దన్నారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఖచ్చితంగా పెట్టాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X