గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవిది రాజకీయ వ్యభిచారం, కోర్టుకు వెళతాం: ఆసరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
గుంటూరు: ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను తప్పి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారని గుంటూరులో ఆసరా అనే స్వచ్చంధ సంస్థ కార్యకర్త సంజీవరెడ్డి ఆరోపించారు. చిరంజీవి ఓటర్లను ఏమార్చినందున కోర్టుకు వెళతానని చెప్పారు. చిరంజీవి గత ఎన్నికల్లో ఇచ్చిన మాటను తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు తెస్తానని రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చి 15 శాతానికిపైగా ఓట్లతో 18 సీట్లను గెలుచుకున్న చిరంజీవి ఇచ్చిన మాటను పక్కన పెట్టాడన్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవినీతి పార్టీలు అని, అవి అధికారంలో ఉంటే సామాన్యులకు ఎలాంటి ఫలితం ఉండదని, సామాజిక న్యాయం ఆ పార్టీల్లో కొరవడిందని అప్పుడు చెప్పారన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పంచన చేరడమేమిటని ప్రశ్నించారు. అప్పుడు తిట్టి ఇప్పుడు అదే పార్టీ పంచన చేరడం కన్నా రాజకీయ వ్యభిచారం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేయడంపై తాను కోర్టుకు వెళతానన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X