వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పోలవరం హరిత యాత్రలో శాసనసభ్యులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
రాజమండ్రి: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చేపట్టిన పోలవరం హరిత యాత్రలో మొదటి రోజు సోమవారం పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి ప్రారంభమైన జగన్ హరిత యాత్రలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకపాటి చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు.

పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర మంత్రి కొణతాల రామకృష్ణ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి కూడా యాత్ర ప్రారంభ కార్యక్రమానికి వచ్చారు. ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైయస్ జగన్ పూలమాల వేసి హరిత యాత్ర ప్రారంభ వేదిక మీదికి చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X