హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కాంగ్రెస్‌లో ఇమడలేకపోయారు: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకనే బయటకు వెళ్లారని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సోమవారం అన్నారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం వల్ల కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఎలాంటి షరతులు పెట్టకుండా చిరంజీవి తన పార్టీని విలీనం చేయడం హర్షదాయకమన్నారు. జగన్ వెళ్లడం, చిరంజీవి రావడం సాధారణం అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి కొందరు రావడం, కొందరు వెళ్లిపోవటం కొత్తేమీ కాదని చెప్పారు.

ప్రస్తుతం జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నాయకత్వాన్ని గౌరవించే వారిపట్ల అధిష్టానం తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనానికి తెలంగాణకు సంబంధం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై తనకు ఏమీ తెలియదన్నారు. విలీనాన్ని రెండు పార్టీల కార్యకర్తలు హర్షిస్తున్నారని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X