Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రభుత్వం పడిపోయే వరకు జగన్‌తో ఉంటా: అంబటి రాంబాబు

Ambati Rambabu
ఏలూరు: దుర్మార్గ ప్రభుత్వం పడిపోయే వరకు మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూనే ఉంటానని గురువారం పోలవరం సాధనా యాత్ర ముగింపు సభలో అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. 2003లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వెంట 1600 కిలోమీటర్ల మేర నేను పాదయాత్ర చేశానని, ఇప్పుడు జగన్ వెంట కూడా పాదయాత్ర చేస్తున్నానన్నారు. అందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. జగన్ అందరికీ ఆశా కిరణంలా కనిపిస్తున్నారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. జగన్ రియల్ హీరో అని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. ఆయన అండతో పోలవరం సాధిస్తామన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 84 ప్రాజెక్టులు చేపట్టారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కార్యక్రమాలలు చప్పగా ఉన్నాయన్నారు. అదే జగన్‌కు మాత్రం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జగన్ నాయకుడు అయ్యే వరకు ప్రజలు ఆయన వెంట నడుస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి దేవుడిచ్చిన వరం అన్నారు. రేపటి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వ్యక్తి జగన్ అన్నారు.

నా రాజకీయ భవిష్యత్తు గురించి నేను ఆలోచించడం లేదన్నారు. అందరూ జగన్‌ను సమర్థించాలన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు. జగన్ త్వరలో వచ్చి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారని చెప్పారు. భవిష్యత్తు నాయకుడు జగనే అన్నారు. జగన్ 30 ఏళ్లు పరిపాలిస్తారన్నారు. ఇలాంటి సభ ఏ జాతీయ నాయకుడికోగానీ అష్టకష్టాలు పడితే గానీ సాధ్యం కానిదన్నారు. మూడు నెలలు, మూడేళ్లు ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ సిద్ధమన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+