వైయస్ భూకేటాయింపులపై రగడ, అసెంబ్లీ రెండుసార్లు వాయిదా

మొదట శాసనసభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను ఉపసభాపతి తిరస్కరించారు. ప్రభుత్వ భూముల పందేరంపై శాసనసభా సంఘం వేయాలని టిడిపి సభ్యులు పట్టుపట్టారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభను ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ అరగంట వాయిదా వేశారు. అరగంట వాయిదా తర్వాత ప్రారంభమైన శాసనసభ మరోసారి అరగంట వాయిదా పడింది. సభలో తెలుగుదేశం పార్టీ భూపందేరాలపై చర్చకు పట్టువీడలేదు. దాంతో ఉపసభాపతి సభను వాయిదా వేశారు. శాసనసభాపక్ష నేతలను తన ఛాంబర్కి రావాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications