ఎమ్మెల్సీ ఎన్నికల్లో వోటింగ్‌పై జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో విభేదాలు

Pilli Subhash Chandra Bose
హైదరాబాద్: శాసనసభ్యుల కోటా కింద జరుగుతున్న ఎన్నికల్లో వోటింగ్ పాల్గొనాలని మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఎవరికి ఓటేయాలనే విషయంపై వారిలో విభేదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. వైయస్ జగన్‌తో గురువారం సమావేశమైన 26 మంది శాసనసభ్యుల్లో విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు పార్టీ అభ్యర్థులకే వోటు వేద్దామని అభిప్రాయపడగా, మరికొంత మంది ప్రతిపక్షాల అభ్యర్థులకు ఓటు వేద్దామని అభిప్రాయపడ్డారు. ఈ స్థితిలో ఎవరికి వారు వోటింగ్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని వైయస్ జగన్ సూచించినట్లు తెలుస్తోంది.

తాము వోటింగులో పాల్గొంటామని శాసనసభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. తాము ఎవరికి వోటు వేస్తామనే విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాపడ్డారు. ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని ఆయన చెప్పారు. దీన్ని బట్టి ఓటింగ్ విషయంలో వారి మధ్య ఏకాభిప్రాయం కుదలేదని అర్థం చేసుకోవచ్చు. ఎవరికి ఓటు వేయాలనే విషయం జగన్ తనకు చెప్పలేదని, తాము ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని మేకపాటి చంద్రశేఖర రెడ్డి కూడా చెప్పారు. దీన్ని బట్టి వారు కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు ఓటు వేసే అవకాశాలు తక్కువే ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. జగన్ వర్గానికి చెందిన ఆళ్ల నాని, భారిత, ప్రసాద రాజు, అశోక్ బాబు ఉదయమే వోటు వేశారు. అధికార కాంగ్రెసు పార్టీ నాలుగో ప్రాధాన్యతా వోటును సిపిఐ అభ్యర్థికి కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థికి ఓట్లు పడకుండా నిరోధించడానికి కాంగ్రెసు ఆ కేటాయింపు జరిపినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+