వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనగర్ మసీదులో పేలుడు, మత పెద్ద మృతి: ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Jammu Kashmir
శ్రీనగర్: శ్రీనగర్‌లోని మైసుమా మసీదు వెలుపల జరిగిన భారీ పేలుడు ఘటనలో ప్రముఖ మత పెద్ద , జమైత్ - ఎ - అహ్లీ హేదీస్ చీఫ్ మౌల్వీ షౌకత్ అహ్మద్ షా మరణించారు. శుక్రవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో జరిగిన పేలుడులో షా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

మునీర్ అహ్మద్ మీర్ అనే యువకుడు కూడా ఈ పేలుడులో తీవ్రగా గాయపడ్డాడు. పేలుడుకు కారమేమిటనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మసీదు ద్వారానికి సమీపంలో సైకిల్‌పై మిలిటెంట్లు ఐఇడి పెట్టి పేల్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రార్థనల కోసం షా ఇక్కడికే వస్తుంటారు.

శ్రీనగర్‌లో రెండేళ్ల క్రితం ఐఇడి పేలింది. మిలిటెంట్లు 2009లో పోలీసు వాహనాలను పేల్చి వేయడానికి కారు బాంబు వాడారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 19 మంది గాయపడ్డారు.

English summary
Prominent religious figure and Jamiat-e-Ahli Hadees chief Moulvi Showkat Ahmad Shah was today killed in an improvised explosive device (IED) blast outside a mosque in Maisuma area of Srinagar, police officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X