మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమించలేదని తండ్రీకూతుళ్లపై దాడి: తండ్రి మృతి, కూతురుకు సీరియస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Medak District
మెదక్: ప్రేమకు నిరాకరించిందన్న కారణంతో తండ్రీ కూతుళ్లపై దాడి చేసిన సంఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో వెళుతున్న తండ్రి ప్రభాకర్, కూతురు ప్రియాంకలపై గుర్తు తెలియను దుండగులు కత్తులతో దాడి చేశారు. వెళుతున్న బస్సును హఠాత్తుగా ఆపి తండ్రీ కూతుళ్లను బస్సులో నుండి దింపి వేసి కత్తులతో దారుణంగా పొడిచారు. దీంతో తండ్రి ప్రభాకర్ అక్కడికక్కడే మరణించారు.

కూతురు ప్రియాంక పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ హాస్పిటల్‌కు తరలించారు. బాధితులు మెదక్ జిల్లాకు చెందిన సంగారెడ్డి వాసులుగా తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే దుర్ఘటనకు కారణంగా తెలుస్తోంది.

English summary
Unknown persons attacked on daughter Priyanka and her father Prabhakar today in Medak district. Police suspecting attack held due to love.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X