కరీంనగర్ టిడిపి కార్యాలయానికి నిప్పు, తెలంగాణ రణభేరీపై ఆగ్రహం

కార్యాలయానికి వాచ్మన్ తాళం వేసి వెళ్లిపోయాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో తెలంగాణవాదులు నిప్పు పెట్టడానికి వీలైందని అంటున్నారు. కాగా, కరీంనగర్ తెలంగాణ రణభేరీకి హైదరాబాదు నుంచి బయలుదేరిన తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారిని తొలుత మెదక్ జిల్లా ఇబ్రహీం నగర్ వద్ద తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ తర్వాత బెజ్జంకి వద్ద వారిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద యెత్తున తెలంగాణవాదుల అరెస్టు జరిగింది. పోలీసులను పెద్ద యెత్తున కరీంనగర్లో దించారు.












Click it and Unblock the Notifications