హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్‌హాక్ కమిటీల కన్వీనర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: పార్టీ సంస్థాగత నిర్మాణంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆయన అడ్‌హాక్ కమిటీలను వేయాలని నిర్ణయానికి వచ్చి, కన్వీనర్లను నియమించారని వార్తలు వస్తున్నాయి. జూలై 8వ తేదీన జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో పూర్తి స్థాయి కమిటీలను వేస్తారని అంటున్నారు. పార్టీ పోలిట్‌బ్యూరోలోకి 22 మందిని తీసుకుంటారని చెబుతున్నారు. పోలిట్‌బ్యూరోలో శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను చేర్చే విషయంపై జగన్ ఆలోచన చేస్తున్నారు.

తన వెంట నడుస్తున్న శాసనసభ్యులను, ముఖ్య నాయకులను పక్కన పెట్టి అడ్‌హాక్ కమిటీలకు జగన్ కన్వీనర్లను నియమించారు. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు మాత్రం కన్వీనర్లను నియమించలేదని తెలుస్తోంది. అందిన వివరాల ప్రకారం వివిధ జిల్లాల అడ్‌హాక్ కమిటీల కన్వీనర్లు ఇలా ఉన్నారు.

శ్రీకాకుళం - శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్ భార్య పద్మప్రియ
విశాఖపట్నం- కొణతాల రామకృష్ణ
విజయనగరం - పెన్మత్స సాంబశివరాజు
తూర్పు గోదావరి - చిట్టబ్బాయ్
వరంగల్ - ప్రతాప రెడ్డి
కృష్ణా - సామినేని ఉదయభాను
కడప - సురేష్ బాబు
నిజామాబాద్ - వెంకటరమణా రెడ్డి
ఖమ్మం - కుంజా ధర్మ
ప్రకాశం - ఎన్ బాలాజీ
పశ్చిమ గోదావరి - మోషెన్ రాజు
గంటూరు - మర్రి రాజశేఖర్
కర్నూలు - గౌరు వెంకటరెడ్డి
మెదక్ - జగపతి
కరీంనగర్ - ఆదిశ్రీనివాస్
అనంతపురం - పైలా నరసింహన్
చిత్తూరు - నారాయణ రావు
అదిలాబాద్ - జనక్ ప్రసాద్
మహబూబ్ నగర్ - ఎడ్మ కృష్ణా రెడ్డి

English summary
YSR Congress party president YS Jagan has appointed conveners for district level adhoc committees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X