ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్‌ను మోసం చేసిన చంద్రబాబును ఎవరూ నమ్మరు: పురందేశ్వరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై కేంద్ర సహాయ మంత్రి, నందమూరి కుటుంబ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి సోమవారం విమర్శలు కురిపించారు. చంద్రబాబునాయుడు తన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌ను మోసం చేసిన చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. చంద్రబాబు నమ్మించాలని చూస్తున్న ఆయన వేశాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో శాసించాడని అలాంటి సమయంలో ఎన్టీఆర్‌కు భారతరత్న డిమాండ్ చేయాలనే విషయం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఆయన అప్పుడు ఏం చేశాడన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. 2014 వరకు కాంగ్రెసు ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.

English summary
Central Minister Purandeswari blamed TDP chief Chandrababu Naidu for demanding Bharath Rathna to NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X