వైయస్సార్ వారసత్వానికి కాంగ్రెసు సమాధి, కిరణ్కు సోనియా సూచన

సచివాలయంలో ఉన్న వైయస్సార్ ఫొటోగ్రాఫ్లను తీసేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కొందరు మంత్రులు ఇప్పటికే తీసేశారు. కడప ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో వైయస్సార్ యుగానికి కాంగ్రెసులో స్వస్తి పలకాలని సోనియా గాంధీ అనుకోవడమే తరువాయి మార్పులు ప్రారంభమయ్యాయి. ఎంతగా ప్రయత్నించినప్పటికీ వైయస్సార్ వారసత్వం కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడదని, వైయస్ జగన్కే అది ఉపయోగపడుతుందని కాంగ్రెసు అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. వైయస్సార్ వారసత్వాన్ని వదిలేసి పార్టీని పటిష్టం చేయడమే మార్గమని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications