Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గవర్నర్ పదవి ఇస్తే రెడీ, ఓపిక ఉన్నంత వరకు ఉంటా: రోశయ్య

Rosaiah
విజయవాడ: పార్టీ అధిష్టానం తనకు గవర్నర్ పదవి ఇస్తే దానిని సమర్థవంతంగా నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పార్టీ అధిష్టానం తనకు ఏ పదవి అప్పగించినా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. తనకు ఓపిక ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ఆమోస్, యాదవరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, పార్టీ అధిష్టానంపై చేసిన ఫిర్యాదులపై కూడా రోశయ్య స్పందించారు.

పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు రావడం సహజమే అన్నారు. పార్టీపై, పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూ నాయకులే వారిని బజారుకు ఈడ్చడం సరికాదన్నారు. ఆమోస్, యాదవరెడ్డిల ఆరోపణలను అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+