అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయి మందిరంలో 98 కిలోల బంగారం, 307 కిలోల వెండి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: భగవాన్ సత్యసాయి బాబా నివసించిన యజుర్వేద మందిరంలో భారీగా నగదు, కిలోల కొద్ది బంగారం, వెండి ఉన్నట్టు ట్రస్టు సభ్యులు శుక్రవారం వెల్లడించారు. మందిరంలో 11.56 కోట్ల రూపాయల నగదు, 98 కిలోల బంగారం, 307 కిలోల వెండి ఉన్నట్లు ట్రస్టు సభ్యులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. డబ్బులు అంతా భారత దేశ కరెన్సీ రూపంలోనే ఉందని చెప్పారు. అయితే బంగారం, వెండి మాత్రం విగ్రహాల రూపంలో ఉన్నట్టు చెప్పారు. కాగా ఈ డబ్బును లెక్కించడానికి 36 గంటల సమయం పట్టింది. మరికొంత ప్రాపర్టీ ఉండవచ్చుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హనుమాన్, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు నిగ్రహాల రూపంలో బంగారం, వండి ఉన్నట్లు చెప్పారు. డబ్బును, బంగారాన్ని స్టేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తామని చెప్పారు. అయితే బాబా వీలునామా రాసినట్లు వచ్చిన వార్తలను ఆయన వారు కొట్టి పారేశారు. బాబా ఎలాంటి వీలునామా రాయలేదన్నారు. సత్యసాయి అపురూప వస్తువులను మ్యూజియంలో ఉంచుతామని చెప్పారు. డబ్బు, వెండి, బంగారం అంతా ఐటి ఆమోదించినదేనని చెప్పారు.

English summary
Sathya Sai Trust members said that 98 kg gold, 307 kg gold and 12 crore rupees in Yajur Mandir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X