గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమించమని అమ్మాయికి వేధింపులు, దేహశుద్ది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur District
నల్గొండ: తనను ప్రేమించమని ఓ అమ్మాయి వెంబడి బడుతున్న ఓ యువకుడికి అమ్మాయి తల్లిదండ్రులు దేహశుద్ది చేసిన సంఘటన నల్గొండ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. మిర్యాలగూడలోని హనుమాన్ పేటకు చెందిన ఓ అమ్మాయిని గత నెల రోజులుగా కనగల్ మండలం నారాయణపురంకు చెందిన నర్సింహ యువకుడు ప్రేమించమని వేధించసాగాడు. అమ్మాయి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. శుక్రవారం నర్సింహ ఏకంగా అమ్మాయి ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులతో తాను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేయమని అడిగారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వారు నర్సింహను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.

కాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర వీరవరసం మండలంలో ఓ ప్రేమికుల జంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వారు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారో తెలియరాలేదు. గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో ప్రియురాలి బంధువులు ప్రియుడిని దారుణంగా కొట్టారు. అతనిని 108 వాహనంలో హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో ప్రియుడి బంధువులు మృతదేహంతో ప్రియురాలి ఇంటిముందు ధర్నాకు దిగారు.

English summary
One young torchered a girl for love at Miryalaguda of Nalgonda district today. Girl parents beaten him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X