రాజస్థాన్లో ఖలేజా చిత్రీకరణ భాను కిరణ్ కోసమేనా?
ముఖ్యంగా రమేష్ రహస్యంగా అనేక సెల్ నెంబర్లు సమకూర్చుకున్నాడని, వీటిని తరచుగా మార్చేవాడని తెలుస్తోంది. వీటిలో మహారాష్ట్ర చిరునామాతో తీసుకున్న ఒక నెంబరు నుంచి మార్చి, ఏప్రిల్ నెలల్లో రాజస్థాన్కు పెద్దసంఖ్యలో కాల్స్ వెళ్లినట్లు సీఐడీ గుర్తించింది. ఇవి భాను కోసమే అయి ఉంటాయని నిర్ధరణకు వస్తోంది. ఈ నెంబర్ నుంచి కొన్ని నెంబర్లకే ఫోన్లు వెళ్లాయి. ఆ నెంబర్లు భానువేనని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సీఐడీ కస్టడీలో ఉన్న రమేష్ రాజస్థాన్ నెంబర్ల విషయంలో చెప్పే సమాచారం అస్పష్టంగా ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆయన నిర్మించిన 'ఖలేజా' చిత్రం ఎక్కువ భాగం రాజస్థాన్లో చిత్రీకరించడంలోని ఆంతర్యాన్ని కూడా ఆరా తీస్తున్నారు.
అజ్ఞాతంలో ఉన్న భానుతో రమేష్, కల్యాణ్ ఇద్దరూ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారని పోలీసులు అనుమానిస్తున్నారు. భాను ఖాతాలోకి నెలనెలా పెద్దమొత్తంలో నిధులు జమయినట్లు గుర్తించారు. ఇవి రమేష్, కల్యాణ్ ఖాతాల నుంచే వెళ్లాయా అన్న కోణంపై వారు పెట్టారు. సీఐడీకి చెందిన ఒక బృందం ప్రస్తుతం చెన్నైలో ఖాతాల పరిశీలన జరుపుతోంది. ఇది 2, 3 రోజులు పట్టొచ్చు.