హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజస్థాన్‌లో ఖలేజా చిత్రీకరణ భాను కిరణ్ కోసమేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu kiran
హైదరాబాద్‌: మద్దెలచెర్వు సూరి హత్య కేసు ప్రధాన నిందితుడు భాను కిరణ్ రాజస్థాన్‌లో తలదాచుకుంటున్నట్లు సిఐడి పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే శింగనమల రమేష్ మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రీకరణను రాజస్థాన్‌లో చేపట్టారని భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ సన్నిహితులైన సినీ నిర్మాతలు శింగనమల రమేష్‌, చిల్లర కల్యాణ్‌లను ఇప్పటికే అరెస్టు చేసిన సీఐడీ, ఇప్పుడు అతడిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. భాను కదలికలపై నిర్దిష్ట సమాచారం సేకరించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం- సూరి హత్య తర్వాత మొదట ఢిల్లీ వెళ్లిన భాను పోలీసులు అక్కడికీ రావడంతో తన మకాం రాజస్థాన్‌కు మార్చాడని తెలుస్తోంది.

ముఖ్యంగా రమేష్‌ రహస్యంగా అనేక సెల్‌ నెంబర్లు సమకూర్చుకున్నాడని, వీటిని తరచుగా మార్చేవాడని తెలుస్తోంది. వీటిలో మహారాష్ట్ర చిరునామాతో తీసుకున్న ఒక నెంబరు నుంచి మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాజస్థాన్‌కు పెద్దసంఖ్యలో కాల్స్‌ వెళ్లినట్లు సీఐడీ గుర్తించింది. ఇవి భాను కోసమే అయి ఉంటాయని నిర్ధరణకు వస్తోంది. ఈ నెంబర్‌ నుంచి కొన్ని నెంబర్లకే ఫోన్లు వెళ్లాయి. ఆ నెంబర్లు భానువేనని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సీఐడీ కస్టడీలో ఉన్న రమేష్‌ రాజస్థాన్‌ నెంబర్ల విషయంలో చెప్పే సమాచారం అస్పష్టంగా ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆయన నిర్మించిన 'ఖలేజా' చిత్రం ఎక్కువ భాగం రాజస్థాన్‌లో చిత్రీకరించడంలోని ఆంతర్యాన్ని కూడా ఆరా తీస్తున్నారు.

అజ్ఞాతంలో ఉన్న భానుతో రమేష్‌, కల్యాణ్‌ ఇద్దరూ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారని పోలీసులు అనుమానిస్తున్నారు. భాను ఖాతాలోకి నెలనెలా పెద్దమొత్తంలో నిధులు జమయినట్లు గుర్తించారు. ఇవి రమేష్‌, కల్యాణ్‌ ఖాతాల నుంచే వెళ్లాయా అన్న కోణంపై వారు పెట్టారు. సీఐడీకి చెందిన ఒక బృందం ప్రస్తుతం చెన్నైలో ఖాతాల పరిశీలన జరుపుతోంది. ఇది 2, 3 రోజులు పట్టొచ్చు.

English summary
It is said that main culprit in Maddelacheruvu Suri murder case, Bhanu Kiran is Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X