హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో సీమాంధ్ర టిడిపికి తెలంగాణ సెగ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మంగళవారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్సులో భేటీ అయ్యారు. అయితే వారి భేటీని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంత ఐక్యకార్యాచరణ సమితి ప్రయత్నాలు చేసింది. వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణవాదుల అరెస్టుతో సీమాంధ్ర టిడిపి భేటీ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగింది. కాగా తమ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు సైతం రాజీనామా చేసిన నేపథ్యంలో వారు భేటీ అయి సీమాంధ్ర నేతలం ఏం చేయాలనే విషయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

కాగా ఈ నెల 7వ తేదిన తెలంగాణ ప్రాంత విద్యార్థులు తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. బందు ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. అక్కడక్కడ చిన్న చిన్నగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ అంతా ప్రశాంతంగా ఉందన్నారు. పలువురు ఆందోళనకారులను అరెస్టు చేశామని చెప్పారు. భద్రత కోసం 31 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. బందులో ఎవరైనా బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూల్సు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోక తప్పదన్నారు. పాఠశాలలు, దుకాణాలు తెరిస్తే భద్రత కల్పిస్తామని చెప్పారు.

English summary
Telangana lawyers JAC take agitation at Seemandhra TDP meeting today. Seemandhra TDP leaders were met at old mla quarters and talk about future plane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X