హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి ఇంటిపై దాడి చేస్తాం!: ఎర్రబెల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్/కరీంనగర్: ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల దీక్షను ప్రభుత్వం భగ్నం చేయాలని చూస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి సైతం వెనుకాడే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం కరీంగనర్ జిల్లాలో మాట్లాడుతూ హెచ్చరించారు. అవసరమైతే బస్సు యాత్రను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తరలిస్తామని చెప్పారు. విద్యార్థులు చేస్తున్న దీక్షకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని చెప్పారు. టిడిపి బస్సు యాత్రపై రాళ్లు వేయడం పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. కాగా ఉస్మానియా విద్యార్థుల దీక్ష సోమవారం ప్రారంభం కానుంది. విద్యార్థులు సామూహిక దీక్షకు సిద్ధమయ్యారు.

దీంతో విశ్వవిద్యాలయం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయం గుర్తింపు కార్డులు ఉన్న వారినే పోలీసులు లోనికి పంపిస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. ప్రజా గాయకుడు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్ విద్యార్థుల దీక్షకు మద్దతు పలికారు. విద్యార్థులపై పాశవిక దాడులను ఖండించాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యార్థులపై దాడికి నిరసనగా ప్రజాప్రతినిధులు, తెలంగాణవాదులు ఓయుకు తరలి రావాలని కోరారు. కాగా కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

English summary
Telugudesam party senior mla Errabelli Dayakar Rao said today that telugudesam party will be attack on CM residence if government is try to obstruct students past.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X