ఆల్ ప్రీ చంద్రబాబు బాటలో జగన్: లగడపాటి ఫైర్

తెలంగాణపై నిస్సహాయుడై చేతులెత్తేసిన జగన్ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. జగన్ కన్ను ముఖ్యమంత్రి పీఠం పైనే ఉందన్నారు. రాష్ట్రంలో భూములే లేకుంటే ఎకరా చొప్పున భూమి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. జగన్ పార్లమెంటులో ఒక్కసారైనా ప్రజా సమస్యల పైన మాట్లాడారా అని ప్రశ్నించారు. సొంత మీడియా ఉందని జగన్ ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయవలసిన అవసరం లేదన్నారు. నాడు తాము రాజీనామాలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగి రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించడానికి తాము ఆనాడు రాజీనామాలు చేయలేదన్నారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత కేవలం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడితే పాస్ కాదని తెలియజెప్పడానికే తాము రాజీనామాలు చేశామని చెప్పారు. చర్చల ద్వారానే తెలంగాణకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications