హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆజాద్ తెలంగాణ నేతలను మరింత రెచ్చగొట్టారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్: రాష్ట్ర సాధన కోసం తెలంగాణ నాయకులను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ మరింత రెచ్చగొట్టారా అనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం కావాలని, శానససభలో తీర్మానం కావాలని ఆజాద్ అన్న మాటలపై తెలంగాణ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలుగుదేశం తెలంగాణ నాయకులు మాత్రమే కాకుండా కాంగ్రెసు తెలంగాణ నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. సీమాంధ్ర నాయకులకు ఆజాద్ వత్తాసు పలుకుతున్నారని దెప్పి పొడుస్తున్నారు. గతంలో తమ పార్టీ రాష్ట్ర ఇంచార్జీగా ఉన్న వీరప్ప మొయిలీకి పట్టిన గతే ఆజాద్‌కు పడుతుందని శాపాలు పెడుతున్నారు.

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ బాధ్యతల నుంచి ఆజాద్‌ను తప్పించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడిగా వ్యవహరించే కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఆజాద్‌పై నిప్పులు చెరిగారు. రాజ్యాంగం గురించి తెలియని ఆజాద్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద 48 గంటల దీక్ష చేపట్టిన కాంగ్రెసు తెలంగాణ నేతలు ఆజాద్‌ను లక్ష్యం చేసుకుని మాట్లాడారు.

తాము రాజీనామాలు చేసిన తర్వాత తమతో మాట్లాడకుండా ఆధిపత్య ధోరణి ప్రదర్శించిన ఆజాద్ అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని చెప్పడం ద్వారా తమను అవమానించారని పార్టీ తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం తమ పట్ల అవమానకరంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది.

English summary
Congress AP affairs incharge Ghulam Nabi Azad provoked Congress Telangana region leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X