హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ ముట్టడి: అధిష్టానానికి దామోదర్ వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం వెంటనే ప్రకటించకుంటే రాజధాని హైదరాబాదును 20 లక్షల మందితో ముట్టడిస్తామని ఎమ్మెల్యే దామోదర రెడ్డి బుధవారం కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. ఇందిరాపార్కు వద్ద చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెలఖరులోగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి కేంద్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన గులాం నబీ ఆజాద్‌ను వెంటనే కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఆజాద్‌కు కేబినెట్లో ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణ రాష్ట్రసాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ అంతిమ లక్ష్యమని ఎంపి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణపై నిర్దిష్ట చర్యలు తీసుకునేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణవాదులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఎంతకైనా పోరాడతామని పొన్నం వ్యాఖ్యానించారు.

English summary
Congress senior mla Damodar Reddy warned party high command that they will ready to hyderabad muttadi with 20 lack people if party not take decision on telangana issue in this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X