వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్ కోసమే తాజా ముంబై పేలుళ్లకు పాల్పడ్డారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Blast
ముంబై: ముంబై 26/11 దాడుల కేసులో దోషిగా తేలిన అజ్మల్ కసబ్ కోసమే ఉగ్రవాదులు బుధవారం దాడులకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. కసబ్ 1987 జులై 13వ తేదీన జన్మించాడని, అతని జన్మదినాన్ని పురస్కరించుకుని ఉగ్రవాదులు అతని కోసం ముంబై దాడులకు పాల్పడ్డారని మీడియా ఊదరగొడుతోంది. టీవీ చానెళ్లు దీన్ని ప్రధానం చేసి వార్తలను ప్రసారం చేస్తున్నాయి. జాతీయ మీడియాతో పాటు తెలుగు టీవీ చానెళ్లు కూడా ఇదే పాట పాడుతున్నాయి. కసబ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిగిన భారీ దాడుల్లో 166 మంది మరణించారు. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కసబ్ మాత్రమే భారత పోలీసులకు చిక్కాడు.

అయితే కసబ్ జులై 13వ తేదీననే జన్మించాడా అనేది స్పష్టం నిర్ధారణ కావడం లేదు. వికీపీడియా అతని పుట్టిన తేదీని 1987 సెప్టెంబర్ 13వ తేదీగా నమోదు చేసింది. అయితే, జైలు రికార్డుల్లో అతని పుట్టిన తేదీ జులై 13వ తేదీగా నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారంనాటి బాంబు పేలుళ్లపై సంచలనం చేయడానికే మీడియా కసబ్ పుట్టిన తేదీతో లింక్ చేస్తున్నట్లు కూడా భావిస్తున్నారు.

English summary
Were today''s synchronised blasts here a birthday giftfor26/11 terror attack convict Ajmal Kasab? Born on July 13, 1987 in Pakistan, Kasab was one of the ten terrorists who carried out the three-day long attacks on the metropolis which began on the evening of November 26, 2008 and left 166 people dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X